వైరస్ ల నియంత్రణకు ఏక్వాప్రో

  • మార్కెట్లోకి  జర్మనీ జియా కంపెనీ టాబ్లెట్

  • పిచ్కారి తో సురక్షితం


విశాఖపట్నం వాస్తవ నయనమ్ : వైరస్ ల నియంత్రణకు జర్మనీ జియా కంపెనీకి చెందిన ఏక్వా ప్రో ఔషదము అద్భుతంగా పనిచేస్తుందని జియా కంపెనీ ఏపీ డిస్ట్రిబ్యూటర్ కె.వి.యస్ రవికాంత్ తెలిపారు ఆదివారం డాబా గార్డెన్స్ విజేఫ్  ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1881 నుంచి ఈ కంపెనీ లిక్విడ్ రూపంలో వైరస్ల నియంత్రణ కు లిక్విడ్ రూపం లో పని  చేస్తుందన్నారు.తాజాగా దీనినే ట్యాబ్లెట్ రూపంలో తీసుకురావడం జరిగింది అన్నారు.పది లీటర్ల నీటిలో 1 గ్రాము టాబ్లెట్ కలిపి పదినిమిషాల తర్వాత పిచికారి చేస్తే 36 గంటల వరకు వారిని  ఎటువంటి వైరస్ లు దరిచేరవు అన్నారు.అదే ఇరుకు గదుల్లో అయితే 72 గంటల వరకు కూడా వైరస్ల ప్రభావం ఉండదన్నారు. మంచి నీటి ట్యాంకులు తో పాటు భారీగా ఈ టాబ్లెట్లు కలపాలి  అనుకుంటే వెయ్యి లీటర్ల కు 10 టాబ్లెట్లు కలపాలన్నారు.ఇవి నోటిద్వారా వేసుకునే ట్యాబ్లెట్లు కావని కేవలం మంచి నీటిలో కలిపి పిచికారి చేసుకునే సురక్షితంగా ఉండవచ్చున న్నారు.ఈ టాబ్లెట్ ద్వారా కోవిడ్  తో పాటు ఇతర అన్ని వైరస్ లు  దూరంగా ఉంచుతుoదన్నారు.ఈ ప్రోడక్ట్ ఉత్పత్తికి తాము అవసరం ఐన అన్ని అనుమతులు తీసుకోవడం జరిగిందన్నారు.దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నారు.ఈ టాబ్లెట్ ను  తాజాగా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నామని త్వరలోనే  దుకాణాలు లో కి అందుబాటులోకి వస్తుంది అని చెప్పారు.ఇతర వివరాలు కు 98481 96886 ఫోన్ నంబర్లో  సంప్రదించవచ్చని అన్నారు.ఒక గ్రాము  టాబ్లెట్ ధర  60 రూపాయలు గా  నిర్ణయించామన్నారు.టాబ్లెట్ కలిపిన నీటిని పిచ్ కారి చేసుకుని బయటకు వెళితే  36 గంటల వరకు సురక్షితంగా ఉంటారన్నారు.ఇది నోటి ద్వారా వేసుకునేది కాదన్నారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు రవి కాంత్ పూర్తిస్థాయి వివరాలు అందజేశారు.దీంతోపాటు తమ సంస్థ  తరఫునుంచి టర్కీ దేశం నుంచి  కొనుగోలు చేసిన మిషన్లో  టాబ్లెట్ వేసి అక్కడే పిచ్ కారి చేసి చూపించారు.ఈ సమావేశంలో వైజాగ్ బ్రాంచ్ మేనేజర్ రాంగోపాల్.. జర్మనీ జియా సంస్థ ప్రతినిధి రమేష్.
ఎం. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..ఈసందర్బముగా వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు సమక్షంలో పలువురు పాత్రికేయులు.. మీడియా ప్రతి నిధులు కు ఉచితము గా టాబ్లెట్ లు పంపిణీ చేసారు.