పోర్ట్ కార్మికులకు న్యాయం చెయ్యండి

347 బ్యాచ్ క్యాజువల్స్ కు  పని వేతనం కల్పించండి


విశాఖపట్నం వాస్తవ నయనమ్ :
విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో గత 12 ఏళ్లుగా సేవలందిస్తున్న క్యాజువల్ కార్మికులను ఆదుకోవాలని సత్వరమే న్యాయం చేయాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోరారు.ఈ మేరకు 
శుక్రవారం 347 బ్యాచ్ కాజువల్ కార్మికులుకి సంబందించిన పలు పెండింగ్ అంశాలను పోర్ట్ చైర్మన్ కె రామ్మోహన్ రావు,డిప్యూటీ చైర్మన్ హరనాధ్ ల దృష్టికి ఎంపీ తీసుకువెళ్లారు.కారుణ్య నియామకాల కింద 12 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన 347 క్యాజువల్ కార్మికులకు నేటికీ సరైన పనిలేకుండా నానా అవస్థలు పడుతున్నారని ఎంపీ తెలియజేశారు.కేంద్రమంత్రి మాoడ వీయ తో పలు మార్లు మాట్లాడటం జరిగింది అని మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ వారికీ తెలియచేసారు.డి ఎల్ బి నుంచి వీరంతా పోర్ట్ లో విలీనం ఐయ్యారని ఐతే ఏళ్లు గడుస్తున్నా నేటికీ వీరికి  సరైన పని లేకుండా పోవడం వల్ల కుటుంబంలతో వీరు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎంపీ  నివేదించారు.వీరితో పాటు చేరిన 27 మందిని రెగ్యులర్ చేసారని తక్షణమే పోర్టులో ఖాళీగా ఉన్న పనులకు వీరిని  వినియోగించుకోవాలని చైర్మన్ ను కోరినట్లు ఎంవీవీ  చెప్పారు. ఇందుకు పోర్ట్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ లు కూడా సానుకూలంగా స్పందించారు.త్వరలోనే వీరి సమస్యకు  పరిష్కారం చూపిస్తామని వీరు హామీ ఇచ్చినట్లు ఎంపీ ఎంవీవీ తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ  చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ను ఎంపీ ఎంవీవీ కార్మిక  సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్ మాజీ సలహాదారు,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు,క్యాజువల్ కార్మికుల సంఘం ప్రతినిధులు శ్రీనివాస్ వర్మ,గోపి కృష్ణ,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.