ఇమ్రాన్‌ఖాన్‌కు కరోనా పరీక్షలు

‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇమ్రాన్‌తో ఇటీవల ప్రముఖ దాత, ఎది ఫౌండేషన్‌ చైర్మన్‌ ఫైసల్‌ ఎది సమావేశమయ్యారు. ఫైసల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఇమ్రాన్‌ ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది.