డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేష‌న్‌కి లారెన్స్ 15 ల‌క్ష‌ల విరాళం

ఎంతో సామాజిక స్పృహ ఉన్న న‌టుడు లారెన్స్‌. విప‌త్క‌ర ప‌రిస్థితుల‌లో త‌న వంతు సాయాన్ని అందించ‌డానికి ఎప్పుడు ముందు ఉండే లారెన్స్ క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ఇటీవ‌ల  మూడు కోట్ల విరాళాన్ని అందించాడు. ఇందులో సింహ‌భాగం త‌న సొంత ఊరు రోయ‌పురంలో కార్మికులు, రోజువారీ కూలీలకు అండ‌గా నిలిచేందుకు రూ.75 ల‌క్ష‌లు కేటాయిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అదేవిధంగా పీఎం కేర్స్ ఫండ్స్ కు రూ.50 ల‌క్ష‌లు, త‌మిళ‌నాడు సీఎం రిలీఫ్ ఫండ్స్ కు రూ.50 లక్ష‌లు, డ్యాన్స‌ర్స్ యూనియ‌న్ కు రూ.50 ల‌క్ష‌లు, దివ్యాంగుల కోసం రూ.25 లక్ష‌లు విరాళంగా ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు. 


తాజాగా చెన్నై చెంగ‌ల్‌పేట తిరువ‌ల్లూర్ కాంచిపురం డిస్ట్రిబ్యూట‌ర్స్ అసోసియేష‌న్‌కి రూ.15 ల‌క్ష‌ల విరాళాన్ని అందించ‌నున్న‌ట్టు పేర్కొన్నాడు. సినిమా షూటింగ్స్, థియేట‌ర్స్‌ బంద్ కావడంతో డిస్ట్రిబ్యూట‌ర్స్ ప‌రిస్థితి కూడా అగ‌మ్య‌గోచ‌రంగా మారింది.ఈ ప‌రిస్థితుల‌లో వారిని ఆదుకునేందుకు లారెన్స్ ముందుకు రావ‌డం హర్ష‌నీయం