కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా నిన్న దేశ వ్యాప్తంగా ప్రజలంతా జనతా కర్ఫ్యూలో భాగస్వాములై, విజయవంతం చేశారు. కాగా, ఒక్క రోజుకే పరిమితం కాకుండా ఈ నెలాఖరు వరకు 8 రాష్ర్టాలు స్వీయనిర్బంధంలో ఉండనున్నాయి.
లాక్డౌన్లో ఉన్న రాష్ర్టాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, బిహార్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, పంజాబ్. కాగా, దేశవ్యాప్తంగా కేంద్రం 80 జిల్లాల్లో లాక్డౌన్ విధించింది. హర్యానాలో 7 జిల్లాలు, ఉత్తరప్రదేశ్లో 15 జిల్లాలు, మధ్యప్రదేశ్లో 5 జిల్లాలు, పశ్చిమబెంగాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ నెల 31 వరకు లాక్డౌన్ అమలులో ఉంటుంది. ఒడిషాలోని 5 జిల్లాలు లాక్డౌన్లో ఉండనున్నాయి. అసోంలో మరో 3 రోజుల పాటు జనతాకర్ఫ్యూ పొడగించారు.
లాక్డౌన్ అయిన రాష్ర్టాలు, ఆయా జిల్లాల్లో అత్యవసర సేవలు యదావిధిగా కొనసాగుతాయి. అంతర్జాతీయ విమానాలు, ప్రజారవాణా పూర్తిగా నిషేధించారు. ప్యాసింజర్ రైళ్లు, మెట్రో, ఎంఎంటీఎస్ సర్వీసులు బంద్ కానున్నాయి. అత్యవసర పరిస్థితి కోసం కొన్నింటిని అందుబాటులో ఉంచనున్నారు.
భారత్లో ఇప్పటివరకు కోవిద్-19 కారణంగా ఏడుగురు వ్యక్తులు మరణించగా, బాధితుల సంఖ్య 360కి చేరకుంది.