తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు మూడు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వ దర్శనానికి మూడు గంటల సమయం, టైమ్‌ స్లాట్‌ పొందిన భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 60,154 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు.