దాదాపు యేడాదిన్నర గ్యాప్ తర్వాత నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ సినిమా చేసాడు. ఈ చిత్రం మంచి టాక్తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ చిత్రం సాధించిన సక్సెస్తో ఆనందంలో ఉన్ననితిన్ తాజాగా హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా సూపర్ సక్సెస్ అయిన ‘అంధాధున్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ రోజు ఈ సినిమాకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు. .ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శ్యాంప్రసాద్ రెడ్డి, సూర్యదేవర రాధాకృష్ణ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా ఈ పూజా కార్యక్రమంలో మెరిసారు.
నితిన్ కొత్త చిత్రం ప్రారంభం.. ముఖ్యపాత్రలో అనసూయ..