అమరావతి: ఏపీలోని నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుపతి నుంచి బెంగాల్కు మృతదేహాన్ని తీసుకువెళ్తున్న అంబులెన్స్ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అంబులెన్స్లో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
లారీ-అంబులెన్స్ ఢీ.. నలుగురికి తీవ్రగాయాలు